సాయిధరమ్‌ తేజ్‌ సినిమా యూనిట్‌కు టీఎస్‌ న్యాబ్‌ పోలీసుల నోటీసులు

సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్‌’ (Ganja shankar) చిత్ర యూనిట్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Updated : 18 Feb 2024 12:07 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్‌’ (Ganja shankar) చిత్ర యూనిట్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు నోటీసులు ఇచ్చారు. గంజాయి (గాంజా) పదాన్ని తొలగించాలని సూచించారు. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలుంటే ఎన్డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై మూవీ టైటిల్‌ ప్రభావం చూపుతుందని.. గంజాయి సీన్స్‌, డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని