Samantha: ‘ది మార్వెల్స్‌’ ప్రమోషన్స్‌లో సమంత సందడి

‘ది మార్వెల్స్‌’ (The Marvels) చిత్రం నవంబర్‌ 10న విడుదల కానుంది. దీని ప్రమోషన్స్‌లో నటి సమంత భాగమయ్యారు.

Published : 03 Nov 2023 18:29 IST

హైదరాబాద్‌: అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీమ్‌ అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ జోరు పెంచింది. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో నటి సమంత (Samantha) పాల్గొని సందడి చేశారు. అలాగే ఓ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసి సినీ ప్రియుల్లో జోష్‌ పెంచారు.

అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత ‘ది మార్వెల్స్‌’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ దీపావళి సినీ ప్రియులకు మరింత వినోదాన్ని పంచనుంది. దీని ప్రమోషన్స్‌లో నేను భాగం కావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. చెడుపై మంచి సాధించే అంతిమ యుద్ధం కోసం ఈ సారి ఒకరు కాదు ఏకంగా ముగ్గురు సూపర్‌ హీరోలు పోరాడనున్నారు. ఈ యాక్షన్‌ మూవీ పండగను మరింత ప్రత్యేకం చేయనుంది. థియేటర్లో చూసి సర్‌ప్రైజ్‌ కావడానికి అందరూ సిద్ధంగా ఉండండి’’ అని సమంత తెలిపారు.

విక్రమ్ జోక్‌ చేశారు.. క్లారిటీ ఇచ్చిన ‘తంగలాన్‌’ టీమ్‌

ఇక మార్వెల్‌ స్టూడియోస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ది మార్వెల్స్‌’ నవంబర్‌ 10న ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మార్వెల్ యూనిట్‌తో కలిసి సమంత కనిపించడంతో ఆమె అభిమానులు సంబర పడుతున్నారు.

ఇక ఈ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ.. ‘నేను అవెంజర్‌ అయితే మా అభిమానులతో కలిసి ప్రపంచాన్ని కాపాడుతాను. ఇండస్ట్రీకి చెందిన వారితో అయితే అల్లు అర్జున్‌, విజయ్‌, ప్రియాంక చోప్రా, అలియాతో కలిసి వరల్డ్‌ను కాపాడుతాను. నా జీవితంలో ఉన్న ముగ్గురు సూపర్‌ హీరోల గురించి చెప్పాలంటే మా అమ్మ.. తను నాకెంతో ధైర్యాన్నిచ్చింది. అలాగే నా స్నేహితులు, నా పెట్స్ కూడా నాకు సూపర్‌ హీరోస్‌తో సమానమే. ఈ దీపావళికి మంచి సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ భిన్నమైన జోనర్లకు చెందినవి. అవి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని