Sarkaru Vaari Paata: పాటకి ముందు ఆట

మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మే 2న థియేట్రికల్‌   ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు గురువారం ప్రకటించాయి సినీ వర్గాలు.  మహేష్‌బాబు, కీర్తిసురేష్‌

Updated : 29 Apr 2022 14:04 IST

హేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మే 2న థియేట్రికల్‌   ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు గురువారం ప్రకటించాయి సినీ వర్గాలు.  మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన   చిత్రమిది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించారు. మహేష్‌బాబుని ఇదివరకెప్పుడూ చూడని ఓ మాస్‌ పాత్రలో ప్రేక్షకులు చూస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలోని నాలుగోపాటని త్వరలోనే విడుదల చేయనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, ఆర్‌.మధి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని