K Vasu: ప్రముఖ దర్శక నిర్మాత కె.వాసు కన్నుమూత
‘ప్రాణం ఖరీదు’తో అగ్ర కథానాయకుడు చిరంజీవిని తెరకు పరిచయం చేయడంతోపాటు... ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ సహా గుర్తుండిపోయే ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకనిర్మాత కె.వాసు (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
‘ప్రాణం ఖరీదు’తో అగ్ర కథానాయకుడు చిరంజీవిని తెరకు పరిచయం చేయడంతోపాటు... ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ సహా గుర్తుండిపోయే ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకనిర్మాత కె.వాసు (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ తనయుడే కె.వాసు. ఆయన బాబాయ్ హేమాంబరధరరావు కూడా దర్శకుడే. 1951 జనవరి 7న హైదరాబాద్లో జన్మించిన కె.వాసు అసలు పేరు కొల్లి శ్రీనివాసరావు. ఆయనకి భార్య రత్నకుమారితోపాటు కుమార్తెలు అన్నపూర్ణ, దీప్తి ఉన్నారు. తండ్రి, బాబాయ్ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన... 22 ఏళ్ల వయసులోనే మెగాఫోన్ పట్టి ‘ఆడపిల్లల తండ్రి’ అనే సినిమాని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. తొలి చిత్రమే శతదినోత్సవం చేసుకుంది. ఆయన ఆ తర్వాత ఆటుపోట్లు ఎదురైనా... ‘ప్రాణం ఖరీదు’, ‘ఏది పాపం ఏది పుణ్యం’ తదితర సినిమాల్ని తెరకెక్కించి విజయాల్ని అందుకున్నారు. ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి తొలి చిత్రమే ‘ప్రాణం ఖరీదు’. కోట శ్రీనివాసరావు కూడా ఓ చిన్న పాత్రతో ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ముద్దు ముచ్చట’, ‘ఒక చల్లని రాత్రి’, ‘కోతల రాయుడు’, ‘దేవుడు మామయ్య’, ‘ఆరని మంటలు’, ఎన్టీఆర్తో ‘సరదా రాముడు’ చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘గోపాలరావు గారి అమ్మాయి’, ‘అమెరికా అల్లుడు’ చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. చిరంజీవితో మొత్తం ఐదు చిత్రాల్ని తెరకెక్కించారు కె.వాసు.
తెలుగులో భక్తి ప్రధానమైన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’ దర్శకుడు ఆయనే. విజయచందర్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రధారులుగా ‘పక్కింటి అమ్మాయి’, కృష్ణంరాజు, శ్రీదేవి కలయికలో ‘బాబులుగాడి దెబ్బ’, చంద్రమోహన్, సరిత కలయికలో వచ్చిన ‘కలహాల కాపురం’తోపాటు, ‘అల్లుళ్లొస్తున్నారు’, ‘ఆడపిల్ల’, ‘ప్రేమచిత్రం పెళ్లి విచిత్రం’, ‘రేపటి రౌడీ’, ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’, ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’, ‘గజిబిజి’ సహా 40కిపైగా చిత్రాల్ని తెరకెక్కించారు. తన కెరీర్లో ఎక్కువ విజయాల్ని అందుకున్న కె.వాసు ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. శనివారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సంతాపం
‘‘సీనియర్ దర్శకుడు వాసు ఇకలేరనే వార్త నన్ను చాలా బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో చేసిన ‘ప్రాణం ఖరీదు’, ‘తోడుదొంగలు’, ‘అల్లుళ్లు వస్తున్నారు’, ‘కోతల రాయుడు’ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’’
చిరంజీవి
‘‘వినోదాత్మక కథలే కాకుండా... భావోద్వేగ ప్రధానమైన అంశాలతోనూ సినిమాలు తెరకెక్కించారు కె.వాసు. ఆయన సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం ప్రత్యేకమైనది. తెలుగు నాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందడంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. అన్నయ్య చిరంజీవి ముఖ్యపాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా దర్శకులుగా వాసుని మరిచిపోలేం. వాసు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’’
పవన్కల్యాణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ