రాఖీ సావంత్‌పై నటి తనూశ్రీ ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా మరో నటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నటి వల్ల తానెంతో బాధ అనుభవించానని అన్నారు.

Published : 13 Oct 2023 20:38 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి తనూశ్రీ దత్తా. రాఖీ వల్ల 2018లో కుంగుబాటుకు గురయ్యానని చెప్పారు. ఈ మేరకు గతంలో రాఖీ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశారు. దీంతో ఓషివారా పోలీసులు రాఖీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం తనూశ్రీ మీడియాతో మాట్లాడారు. లైమ్‌లైట్‌లో ఉండటం కోసం రాఖీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందన్నారు. ఆమె ఆరోపణల వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు.

‘‘మీటూ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో పలు ఛానెల్స్‌కు రాఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె నన్ను అనరాని మాటలు అన్నారు. ఆమె ఆనాడు చేసిన ఆరోపణలు అన్నింటినీ రికార్డ్‌ చేసి పోలీసులకు అందించా. ఆమె ఆరోపణల వల్ల నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఇకపై ఆమె ఆటలు చెల్లవు. ఆమెపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఆమె చేసిన ఆరోపణల వల్ల నా పరువుకు భంగం వాటిల్లింది. నేను పెళ్లి కూడా చేసుకోలేకపోయా. ఇటీవల రాఖీ మాజీ భర్త, ప్రాణ స్నేహితురాలు మీడియా ముందుకు వచ్చి ఆమె చేసిన దారుణాలు బయటపెట్టారు. రాఖీ ప్రవర్తన గురించి తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లంత మూర్ఖులు ఉండరు. జీవితంపై ఆశ లేని వాళ్లు మాత్రమే ఆమెను పెళ్లి చేసుకోగలరు. ఆమెతో కలిసి వర్క్‌ చేయగలరు’’ అని తనూశ్రీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని