Seetimaarr: ఆ సత్తా ‘సీటీమార్’కి ఉంది: గోపీచంద్
ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చే సత్తా ‘సీటీమార్’ చిత్రానికి ఉందన్నారు నటుడు గోపీచంద్.
హైదరాబాద్: ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చే సత్తా ‘సీటీమార్’ చిత్రానికి ఉందన్నారు నటుడు గోపీచంద్. కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది రూపొందించిన చిత్రమిది. తమన్నా కథానాయిక. భూమిక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ‘2019 డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. 50శాతం చిత్రీకరణ పూర్తయ్యాక కొవిడ్ ప్రారంభమైంది. విడుదల సమయంలో సెకండ్ వేవ్ మొదలైంది. గత కొన్నిరోజులుగా పరిస్థితులు యథాస్థితికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మా కమర్షియల్ సినిమా వస్తోంది. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టే సత్తా ఈ చిత్రానికి ఉంది. దీన్ని ఆదరిస్తే మిమ్మల్ని అలరించేందుకు ఇంకా ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. మా నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు సంపత్తో గతంలో ‘గౌతమ్ నంద’ చేశా. ‘సీటీమార్’ కోసం ఎంతో శ్రమించాడు. నా సహ నటులు, గాయకులు, రచయితలు, సాంకేతిక బృంద సభ్యులందరికీ థ్యాంక్స్. మరోసారి చెబుతున్నా.. మీరు ఎంజాయ్ చేసే ఇంటికి వెళ్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు.
సంపత్ నంది మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం రాకముందే సినిమా మనకి పరిచయమైంది. మనలో ఓ భాగమైంది. ఇండియాలో క్రికెట్ తర్వాత అందరూ కోరుకునే వినోదం సినిమానే. అన్ని మతాల వారు కలిసి వెళ్లేది థియేటర్కే. మన దర్గా అదే. మన దుర్గమ్మ గుడి అదే. మన చర్చి కూడా అదే. అలాంటి మన సినిమా థియేటర్లు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర కాలంగా కటౌట్లు కనిపించట్లేదు, పాలాభిషేకాలు లేవు, పేపర్లు చించడం లేదు. కొవిడ్ ప్రారంభంతో విధించిన లాక్డౌన్ తర్వాత ‘క్రాక్’ చిత్రం విజృంభించింది. మళ్లీ థియేటర్లకి పూర్వ వైభవం రావాలి. అందుకే మా నిర్మాతలకి ఎన్ని ఇబ్బందులున్నా, ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఈ వినాయక చవితికి విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటున్నా. మీరంతా మెచ్చుకునే సినిమా ఇది’ అని తెలిపారు.
‘నేను, నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఒకేసారి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాం. పక్కా ప్రణాళికతో సినిమాలు నిర్మిస్తారాయన. అమ్మాయిలకి స్ఫూర్తిన్నిచ్చే ఈ చిత్రానికి పనిచేసిన అందరినీ అభినందిస్తున్నా. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా గోపీచంద్ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ సినిమా మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’ అని బోయపాటి శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, దర్శకులు మారుతి, ప్రశాంత్ వర్మ, శ్రీవాస్, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM