Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ ‘మౌనవ్రతం’.. ఎందుకంటే?

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. తన స్వరపేటికలో మార్పు వచ్చిందని, కోలుకునేందుకు ఓ వారం విశ్రాంతి తీసుకుంటున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకాశ్‌రాజ్‌ తెలియజేశారు.

Published : 16 Nov 2021 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. స్వరపేటిక సమస్య కారణంగా ఓ వారం విశ్రాంతి తీసుకోనున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రకాశ్‌రాజ్‌ తెలియజేశారు. కంప్లీట్‌ హెల్త్‌ చెకప్‌ కోసం వైదుల్ని సంప్రదించగా ఈ సమస్య బయటపడిందన్నారు. కంగారుపడాల్సిన అవసరంలేదని, తాను ఎప్పటిలానే ఉల్లాసంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. స్వరపేటిక కాస్త ఇబ్బంది పెడుతోంది. అది మినహా మరే సమస్యా లేదు. వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇకపై మౌనవత్రం చేయాలి’ అని ట్వీట్‌ పెట్టారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు ప్రకాశ్‌రాజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రకాశ్‌రాజ్‌ ఇటీవల.. ‘జై భీమ్‌’, ‘ఎనిమీ’, ‘పెద్దన్న’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని