Pragya Jaiswal: రెండోసారి కొవిడ్‌ బారినపడిన ప్రగ్యాజైశ్వాల్‌

నటి ప్రగ్యా జైశ్వాల్‌ మరోసారి కొవిడ్‌ బారినపడ్డారు. ఇప్పటికే ఓసారి కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రగ్యా.. బాలకృష్ణతో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది....

Published : 10 Oct 2021 19:56 IST

హైదరాబాద్‌: నటి ప్రగ్యా జైశ్వాల్‌ మరోసారి కొవిడ్‌ బారినపడ్డారు. ఇప్పటికే ఓసారి కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రగ్యా.. బాలకృష్ణతో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. కాగా, గత కొన్నిరోజుల నుంచి జలుబు, జ్వరం, నీరసంతో ఇబ్బందిపడుతున్న ప్రగ్యా.. తాజాగా వైద్యులను సంప్రదించి, కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆమె సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. ‘ఇప్పటికే ఓసారి కొవిడ్‌ బారి నుంచి కోలుకుని వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ.. నాకు మరలా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటం వల్ల వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యాను. గడిచిన పది రోజుల్లో నన్ను కలిసిన వాళ్లందరూ ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను’ అని ప్రగ్యా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని