Prakashraj: ప్రధానమంత్రి గారూ.. క్షమాపణ మాత్రమే సరిపోదండి..!

అన్నదాతల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయి....

Published : 21 Nov 2021 15:01 IST

హైదరాబాద్‌: అన్నదాతల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామంటూ శనివారం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం సైతం రూ.25 లక్షలు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ నిర్ణయంపై తాజాగా సినీ ప్రముఖులు సమంత, ప్రకాశ్‌ రాజ్‌, నాని, రామ్‌, రానా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మంచిదని సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అన్నదాతల కుటుంబాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రకాశ్‌ రాజ్‌.. కేసీఆర్‌ నిర్ణయంపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. క్షమాపణలు ఒక్కటే సరిపోవు. ఆ రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ‘‘సాగు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను పక్కనపెడితే.. అన్నదాతల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోంది’’ అంటూ రామ్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని