Dhanush: ‘సామాన్యులే పన్ను కడుతుంటే మీకేంటి ఇబ్బంది?’.. ధనుష్‌పై హైకోర్టు ఆగ్రహం

కోలీవుడ్‌ స్టార్‌హీరో ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురయ్యింది. వీఐపీలైనా సరే పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు మాత్రం  ఇబ్బంది ఏమిటి అంటూ ప్రశ్నించింది....

Published : 05 Aug 2021 13:51 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌హీరో ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురయ్యింది. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ‘సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు ఇబ్బంది ఏమిటి’ అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానులేనని ఉద్ఘాటించింది. 

అసలేం జరిగిందంటే.. 2015లో ధనుష్‌ అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన అదే ఏడాదిలో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా ధనుష్‌ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారు? అని ధనుష్‌ని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ఆయన సమాధానమిచ్చారు. హీరో విజయ్‌కు సైతం ఇటీవల కోర్టు నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. పన్ను కట్టనందుకు విజయ్‌కు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని