Atithi Devo Bhava:అందరూ అతిథులే

నా తొలి సినిమానే సంక్రాంతికి విడుదలవుతుండడం ఆనందంగా ఉందన్నారు పొలిమేర నాగేశ్వర్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. ఆది సాయికుమార్‌, నువేక్ష జంటగా నటించారు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.

Updated : 05 Jan 2022 07:05 IST

నా తొలి సినిమానే సంక్రాంతికి విడుదలవుతుండడం ఆనందంగా ఉందన్నారు పొలిమేర నాగేశ్వర్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. ఆది సాయికుమార్‌, నువేక్ష జంటగా నటించారు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు పొలిమేర నాగేశ్వర్‌. అతిథిని దేవుడిలా భావించే ఓ యువకుడి కథతోనే చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఆయన చెప్పారు. ‘‘ప్రేమ, యాక్షన్‌ అంశాలతో థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కథలో హీరోకి అందరూ అతిథులే. అలా ఎందుకు అనుకుంటాడనేది ఆసక్తికరం. ప్రేక్షకుడు తప్పకుండా ఓ మంచి సినిమా చూసిన అనుభూతికి గురవుతాడు. ఆది సాయికుమార్‌తోపాటు, నువేక్ష, రోహిణి, నవీన రెడ్డి చక్కటి అభినయం ప్రదర్శించారు. సప్తగిరి పాత్ర సినిమాకి హైలెట్‌ అవుతుంద’’న్నారు పొలిమేర నాగేశ్వర్‌. తనకి యాక్షన్‌ ప్రధానమైన సినిమాలంటే ఇష్టమనీ, ఇప్పటికే ఆ నేపథ్యంలో పలు కథలు రాసుకున్నానని ఆయన తెలిపారు. అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన ఆయన తన సినీ ప్రయాణం గురించి చెబుతూ... ‘‘మాది చోడవరం దగ్గర భోగాపురం. కాలేజీ రోజుల్లోనే సినిమాపై ఆసక్తి ఉండేది. నాటకాల్లో ప్రవేశం ఉంది. అందుకే బీటెక్‌ తర్వాత హైదరాబాద్‌కి వచ్చి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టా. వి.వి.  వినాయక్‌, కె.విశ్వనాథ్‌తోపాటు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశా. రాజాబాబు మిర్యాల పరిచయం తర్వాత ఆయన అవకాశం ఇవ్వడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని