Radheshyam: కడుతూ స్నేహం..గెలిచా ప్రతి శిఖరం

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 17 Dec 2021 11:04 IST

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘‘సంచారి..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ‘‘కొత్త నేలపై కాలి సంతకం. కొండ గాలితో శ్వాస పంపకం. తెరిచా హృదయం.. కడుతూ స్నేహం.. గెలిచా ప్రతి శిఖరం’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యమందించగా.. జస్టిన్‌ ప్రభాకర్‌ స్వరాలు సమకూర్చారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తున్న ప్రేమికుడిగా ప్రభాస్‌ పాటలో కనిపించారు. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. ఆర్‌.రవీందర్‌ రెడ్డి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకర్‌ స్వరాలు సమకూర్చగా.. హిందీ వెర్షన్‌కు మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతమందించారు. మనోజ్‌  పరమహంస ఛాయాగ్రహణం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని