sasivadane: శశివదనే..అందమైన ప్రేమకథ

‘పలాస’ సినిమాతో హీరోగా అందరి మెప్పు పొందారు రక్షిత్‌ అట్లూరి. ఇప్పుడాయన కథానాయకుడిగా  నటిస్తున్న కొత్త చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు.

Updated : 17 Nov 2021 07:26 IST

‘పలాస’ సినిమాతో హీరోగా అందరి మెప్పు పొందారు రక్షిత్‌ అట్లూరి. ఇప్పుడాయన కథానాయకుడిగా  నటిస్తున్న కొత్త చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. కోమలి ప్రసాద్‌ కథానాయిక. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌ కొట్టగా.. సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత శరత్‌ మరార్‌ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో రక్షిత్‌ మాట్లాడుతూ.. ‘‘మంచి అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. దర్శకుడు సాయి విజన్‌ బాగుంది’’ అన్నారు. ‘‘నాకెంతో ప్రత్యేకమైన చిత్రమిది. దర్శకుడు కథ చెప్తున్నప్పుడే.. సినిమా కళ్ల ముందు కనిపించింది’’ అంది నాయిక కోమలి. దర్శకుడు మాట్లాడుతూ..‘‘నా తొలి సినిమా ఇది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రక్షిత్‌, కోమలిల జోడీ బాగుంటుంది. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు నిర్మాత అహితేజ. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్‌, ఛాయాగ్రహణం:  సాయికుమార్‌ దార.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని