Waltair Veerayya: మలేషియాకు వీరయ్య

చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఇటీవలే ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

Updated : 30 May 2022 06:53 IST

చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఇటీవలే ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను మలేషియాలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. జూన్‌ రెండో వారంలో మొదలు కానున్న ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలతో పాటు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు    సమాచారం. ఈ షెడ్యూల్‌ దాదాపు మూడు వారాల పాటు అక్కడే కొనసాగనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో  చిరు పూర్తి మాస్‌ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని