Shooting: ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి!

నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఎలాంటి సంబంధాలు...

Updated : 13 Aug 2021 09:40 IST

లండన్‌: నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించామన్నారు. మృతుల్లో కాల్పుల జరిపిన ఓ వ్యక్తి కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైనట్లు డెవాన్, కార్న్‌వాల్ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కీహామ్​జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు. ఎయిర్​ అంబులెన్స్​, పారా మెడికల్​ సిబ్బంది త్వరితగతిన స్పందించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని