ఉచిత టీకా హామీ ఉల్లంఘనేమీ కాదు: ఈసీ
బిహార్లో భాజపా ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే కోరిన సమాచారం మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది...........
దిల్లీ: బిహార్లో భాజపా ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే కోరిన సమాచారం మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్-VIIIలో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత టీకా హామీ ఉల్లంఘించడం లేదని ఈసీ వివరించింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా మేనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తుచేసింది.
భాజపా ఇచ్చిన ఉచిత టీకా హామీ వివక్షాపూరితంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ గోఖలే ఆరోపించారు. దీనిపై ఈసీ తాజాగా ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా కేవలం ఒక్క రాష్ట్రానికే ఈ హామీ ఇచ్చిందన్న విషయాన్ని ఈసీ విస్మరించిందని ఆరోపించారు.
బిహార్లో అధికారంలోకి వస్తే కరోనా వైరస్ టీకా ఉచితంగా అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఒక్క బిహార్కే వ్యాక్సిన్ అందజేస్తే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..