బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతికి వినతి
పార్లమెంట్ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను విపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆ బిల్లులను సభలో ఆమోదించుకున్నారని..........
దిల్లీ: పార్లమెంట్ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను విపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆ బిల్లులను సభలో ఆమోదించుకున్నారని, వాటిని వెనక్కి పంపాలని విన్నవించాయి. ఈ మేరకు విపక్షాల తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ బుధవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. విపక్షాల తరఫున వినతపత్రం సమర్పించారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులు తీసుకొచ్చేముందు ఇతర పార్టీలను గానీ, రైతు సంఘాల నేతలను గానీ కేంద్రం సంప్రదించలేదని చెప్పారు. బిల్లులను ఆమోదించే క్రమంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. దీనిపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆమోద పొందిన బిల్లులను వెనక్కి పంపాలని కోరినట్లు తెలిపారు.
ఇటీవల మూడు కీలక బిల్లులను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్ 2020, ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020ని ఇరు సభలూ ఆమోదించాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందులో రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ఆదివారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో అందుకు కారణమైన 8 మంది ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?