నెలకే కూలిన బ్రిడ్జి.. ఎలుకలతో లింకేంటి?
బిహార్లో గోపాల్గంజ్ వద్ద గండక్ నదిపై నిర్మించిన పైవంతెన కూలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన నెల రోజులకే నిర్మాణంలోని కొంత భాగం కూలిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోపాల్గంజ్- తూర్పు.....
పట్నా: బిహార్లో గోపాల్గంజ్ వద్ద గండక్ నదిపై నిర్మించిన పైవంతెన కూలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన నెల రోజులకే నిర్మాణంలోని కొంత భాగం కూలిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోపాల్గంజ్- తూర్పు చంపారన్ను కలుపుతూ 1.4 కిలోమీటర్ల పొడవున రూ.264 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత నెల 16న దీన్ని సీఎం నితీశ్ ప్రారంభించారు. అయితే, బ్రిడ్జి కొంతభాగం బుధవారం కూలి నదిలో కొట్టుకుపోయింది.
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటన విపక్షాలకు ఇది ఆయుధంగా దొరికింది. ‘‘రూ.263.47 కోట్లతో 8 ఏళ్ల పాటు నిర్మితమైన బ్రిడ్జిని నితీశ్ ప్రారంభించిన 29 రోజులకే కూలిపోయింది. అంత ఆత్రుతగా ఎవరి మెప్పు పొందడానికి ఈ బ్రిడ్జిని ప్రారంభించారు’’ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. బ్రిడ్జిని నిర్మించిన కంపెనీని నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ విషయంలో ఎవరైనా నితీశ్ను ఎవరైనా అవినీతి పరుడని అంటారేమో.. ఆయన ఎలుకలు కూడా ఈ మొత్తం మద్యాన్ని తాగేస్తాయ్ తెలుసా’’ అంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా సైతం ఈఘటనకు ఎలుకలను నిందించలేం అంటూ దుయ్యబట్టారు.
అయితే, ఈ ఘటనపై రహదారుల శాఖ మంత్రి నంద కిశోర్ స్పందిస్తూ.. కూలింది కేవలం అప్రోచ్ శ్లాబ్ మాత్రమేనని, బ్రిడ్జికి ఏమీ కాలేదని తెలిపారు. గతంలో బిహార్లో పెద్దమొత్తంలో సీజ్ చేసిన మద్యం ఖాళీ అవ్వడంతో అప్పట్లో పోలీసులు ఎలుకలే తాగేశాయని పేర్కొన్నారు. అంతకుముందు 2017లో బిహార్లో సంభవించిన వరదలకు ఎలుకలే కారణమని అప్పటి మంత్రి పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ రెండు ఉదంతాలను ప్రస్తుతానికి జత చేస్తూ ఎలుకలను కూడా రాజకీయాల్లోకి లాగేశారన్నమాట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు