ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి
ఏడాదికి రెండు కోట్లమందికి ఉద్యగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు....
ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
దిల్లీ: ఏడాదికి రెండు కోట్లమందికి ఉద్యగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత కొద్దిరోజులుగా ప్రధాని మోదీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆయన ఆదివారం మరోమారు నిరుద్యోగంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ‘రోజ్గార్ దో’ (ఉద్యోగాలు ఇవ్వండి) పేరుతో వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయినప్పుడు, దేశంలోని యువతకు ప్రతి ఏడాది రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు.అయితే ఆయన వారి కలలను అమ్మేశారు. నిజం ఏంటంటే ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు. ఎందుకిలా జరిగిందంటే..నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ వంటి తప్పడు విధానాల వల్లనే. ఈ మూడింటి కారణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ నాశమయింది. మరో నిజం ఏంటంటే.. భారత్ తన దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోజ్గార్ దో పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని ఆయన కోరారు. రాహుల్ గాంధీ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిసిస్తూ వీడియోనే తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘ఉపాధి పొందండం అనేది యువత హక్కు. అప్పుడే దేశం, యువత పురోగతి సాధిస్తారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..