ఇప్పుడు స్పందించరేం..
పంజాబ్ హత్యాచార ఘటన పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించకపోవటంపై ప్రకాశ్ జావడేకర్ నిరసన వ్యక్తం చేశారు.
పంజాబ్ హత్యాచార ఘటనపై సోనియా కుటుంబానికి సూటి ప్రశ్న
దిల్లీ: పంజాబ్లో చోటుచేసుకున్న దళిత బాలిక హత్యాచార ఘటన పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించకపోవటంపై.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ నిరసన వ్యక్తం చేశారు. హోషియార్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి, అనంతరం దహనం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, చిన్నారి మృతదేహం టాండా పట్టణం సమీపంలోని జలాల్పూర్ గ్రామంలో లభించింది. ఈ కేసులో గుర్ప్రీత్ సింగ్ అనే యువకుడు, ఆయన తాత సుర్జీత్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరణించిన బాలిక తండ్రి బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడని తెలిసింది.
కాగా, ఇది అత్యంత దిగ్భాంతికర సంఘటన అని.. దీనిపై సత్వరమే కఠిన చర్య తీసుకోవాలని ఆయన రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ ఘటన పట్ల కఠిన విమర్శలు చేసిన గాంధీల కుటుంబం.. రాజకీయ యాత్రలను ఆపి పంజాబ్లో మహిళల పట్ల జరుగుతున్న నేరాల పట్ల దృష్టి పెట్టాలని మంత్రి హితవు పలికారు.
‘‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరూ టాండా బాధితురాలి కుటుంబాన్ని సందర్శించనే లేదు. వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలను గురించి వారు పట్టించుకోరు. కానీ హాథ్రస్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో ఫోటోలు తీసుకుంటారు.’’ అని ఈ సందర్భంగా జావడేకర్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్