Revanth Reddy: నాగర్‌ కర్నూలు పీఎస్‌లో రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 15 Aug 2023 16:56 IST

నాగర్‌కర్నూల్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై నాగర్‌ కర్నూలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులపై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగర్‌కర్నూలు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని