Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్కు వెళితే ఏదైనా సాధ్యమేనని గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు.
ఇంటర్నెట్డెస్క్: క్రీడల్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతాయని గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అభిప్రాయపడ్డాడు. తాను కనీసం వరల్డ్ ఛాంపియన్ షిప్నకు అర్హత సాధిస్తానా అని సందేహించే దశ నుంచి ఇప్పుడు ఎంతో మారిపోయినట్లు పేర్కొన్నాడు. గతేడాది బుడాపెస్ట్లో టాప్-6 నిలిచిన ఆటగాళ్లలో ముగ్గురు భారతీయులే ఉన్నారని గుర్తు చేశాడు. దీంతో ప్రపంచ జావెలిన్లో ఐరోపా ఆటగాళ్లకు తాము ఏమీ తీసిపోమనే ఆత్మవిశ్వాసం వచ్చిందని తెలిపాడు. మనం ఇదే నమ్మకాన్ని పారిస్లోకి తీసుకెళితే ఏదైనా సాధ్యమేనని ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు. సాయ్ మీడియాతో మాట్లాడతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడు దోహా లీగ్లో పాల్గొనేందుకు వెళ్లాడు. గతేడాది కూడా దోహాలో అతడు బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.
ఒమెగా సంస్థతో ఒప్పందం..
ఒలింపిక్స్కు 1932 నుంచి అధికారిక టైమ్ కీపర్గా ఉన్న ఒమెగా సంస్థతో నీరజ్ ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఈ స్విస్ లగ్జరీ వాచ్ దిగ్గజం దీనిపై స్పందిస్తూ.. ఒమెగా కుటుంబంలోకి నీరజ్కు స్వాగతం. అతడి అంకితభావం, ప్రతిభ, కచ్చితత్వం చూసి ఎంపిక చేశాం’’ అని పేర్కొంది. ఈసందర్భంగా చోప్రా మాట్లాడుతూ ‘‘ఒలింపిక్ టైమ్ కీపింగ్లో కీలక పాత్ర పోషించే ఈ దిగ్గజ బ్రాండ్లో భాగమయ్యేందుకు ఉత్సుకతతో ఉన్నా’’ అని పేర్కొన్నాడు. జావెలిన్త్రో క్రీడలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు