Sharad Pawar: ‘ఆ ప్రయత్నం ఆందోళనకరం’.. కేసీఆర్ భారీ కాన్వాయ్పై పవార్ వ్యాఖ్య
భారీ కాన్వాయ్తో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడంపై శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. ఆ ప్రయత్నం ఆందోళనకరమన్నారు.
పుణె: తెలంగాణ ముఖ్యమంత్రి, భారాస (BRS) అధినేత కేసీఆర్ (CM KCR) ఇటీవల మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం వెంట 600లకు పైగా వాహనాలతో హైదరాబాద్ నుంచి సోలాపుర్ వరకు భారీ కాన్వాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ తన బలాన్ని ప్రదర్శించేందుకు చేసిన ప్రయత్నం ఆందోళనకరమని ఆక్షేపించారు.
‘‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి వచ్చి ఆలయాలను సందర్శించడానికి వస్తే అందుకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, భారీ సంఖ్యలో వాహనాలను తీసుకొచ్చి తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ తన పర్యటనలో ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తే బాగుండేది’’ అని పవార్ (Sharad Pawar) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో పండరిపుర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఎన్సీపీ నేత భగీరత్ భాల్కే మంగళవారం కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. దీనిపై పవార్ స్పందిస్తూ.. ఒక్క వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు.
గత సోమవారం మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ (KCR).. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పండరిపుర్లోని శ్రీ విఠల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించారు. తర్వాత పలు ఆలయాలను దర్శించుకుని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్కోలీలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, కేసీఆర్ పర్యటనపై మహారాష్ట్ర రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. భారాస అంటే భాజపా బీ టీం అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ