Sunetra-Supriya: ప‘వార్’ వేళ.. వదిన x మరదళ్ల సవాల్ ఉంటుందా..?
సార్వత్రిక ఎన్నికల తేదీ ప్రకటన దగ్గరపడుతోన్న సమయంలో పవార్(Pawar) కుటుంబ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ లోక్సభ నియోజకవర్గం ‘బారామతి’(Baramati)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శరద్ పవార్(Sharad Pawar) కుటుంబానికి పట్టున్న ఈ స్థానానికి ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె సోదరుడు అజిత్ పవార్(Ajit Pawar) సతీమణి సునేత్ర( Sunetra Pawar) కూడా ఇక్కడినుంచే పోటీచేసే అవకాశాలున్నట్టు పలు వార్తా కథనాలు వెల్లడవుతున్నాయి. శుక్రవారం అజిత్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు దోహదం చేస్తున్నాయి.
సుప్రియా సూలే(Supriya Sule) బారామతి సిట్టింగ్ ఎంపీ. 2009 నుంచి అక్కడ విజయం సాధిస్తున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని వారిని ఆమెపై బరిలోకి దింపుతామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. మొదటిసారి పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని, అభివృద్ధికి ఓటేయాలని అభ్యర్థించారు. దాంతో ఆయన సతీమణినే బరిలో దింపుతారనే వార్తలు మొదలయ్యాయి. తదుపరి లోక్సభ ఎంపీ అంటూ ఇటీవల సునేత్ర పవార్ పేరిట కొన్ని బ్యానర్లు వెలిశాయి. అది కూడా ప్రస్తుత వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సునేత్ర పవార్.. ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీఓను నెలకొల్పి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యా ప్రతిష్ఠాన్ విద్యాసంస్థకు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
గతేడాది జులైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా- శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత నుంచి శరద్ పవార్(Sharad Pawar) ఎన్సీపీపై క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చారు. ఇక పార్టీ ఎవరిదనే విషయమై దానిలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇటీవలే ఈసీ పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. పవార్ వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’ అనే పేరు కేటాయించింది. ఈసీ ఆదేశాలను సీనియర్ పవార్ సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం