ఈ విజయం వారిద్దరికీ అంకితం:సంజయ్
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు భాజపాకు గురుతర బాధ్యత అప్పగించారని ఆ పార్టీ రాష్ట్ర
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు భాజపాకు గురుతర బాధ్యత అప్పగించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసి..అబద్ధాలతో గెలిచిందని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెరాస కోసం ఆ పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఈసీ ఎక్కువగా కష్టపడ్డారని.. భాజపా కార్యకర్తలపై దాడులను డీజీపీ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ విజయాన్ని అడ్డుకునేందుకు యత్నించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), డీజీపీకి ఈ గెలుపును అంకితమిస్తున్నామని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు శాశ్వతంగా షెడ్డుకు వెళ్లిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని.. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. భాజపా ఏ వర్గానికీ వ్యతిరేకం కాదన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయని సంజయ్ ఆరోపించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం కోరుకుంటున్న హైదరాబాద్ ప్రజలు.. భాజపాకు మెరుగైన విజయాన్ని అందించారన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర నుంచి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు, ధర్మం, అమరవీరుల ఆశయాలు, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పనిచేస్తామని సంజయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్