Gujarat Polls: రూ.33వేల కోట్లు విద్యా రంగానికే!: మోదీ
గుజరాత్లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. 20 ఏళ్ల క్రితం రాష్ట్ర బడ్జెట్లో రూ.1600 కోట్లుగా ఉన్న కేటాయింపులు.. ప్రస్తుతం రూ.33 వేల కోట్లకు చేరాయని అన్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన పార్టీ భాజపా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లోని దేఘం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో శాస్త్రీయ విధానంలో, ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన సాగుతోందని చెప్పారు. ఇటీవల అహ్మదాబాద్లో పర్యటించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లోని విద్యా వ్యవస్థపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో సుమారు రూ.33 వేల కోట్లు విద్యారంగం కోసమే కేటాయిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇది కొన్ని రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ 20 ఏళ్ల క్రితం విద్యారంగం కోసం గుజరాత్ బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.1,600 కోట్లు. ప్రస్తుతం ఇది రూ.33వేల కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కంటే ఇది ఎక్కువ’’ అని ప్రధాని మోదీ అన్నారు.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం రూపురేఖలే మారిపోయాయని మోదీ తెలిపారు. గాంధీనగర్ ‘ఎడ్యుకేషన్ హబ్’గా తయారైందని, ఎన్నో కళాశాలలు, యూనివర్సిటీలకు ఇది నిలయంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫొరెన్సిక్ సైన్స్, చిల్డ్రన్ యూనివర్సిటీలు అహ్మదాబాద్లోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. భారత్లో మొట్టమొదటి ఎనర్జీ యూనివర్సిటీ (పండిత్ దీన్దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ), మారిటైమ్ యూనివర్సిటీలు గాంధీనగర్లోనే ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్కు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళికలు లేవని, భాజపా నేతలను విమర్శించేందుకే ఆ పార్టీ నేతలకు సమయం సరిపోతోందని మోదీ విమర్శించారు. అంతేకాకుండా పేదల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గత 27 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భాజపాను ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని, మళ్లీ కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో డిసెంబరు 1, 5న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?