ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్లో వచ్చేది మేమే: అమిత్షా
రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా బదులిచ్చారు.
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా బదులిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కూల్చబోమని, కానీ 2023లో వచ్చేది మాత్రం తామేనని చెప్పారు. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘తమ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనని వాళ్లు (కాంగ్రెస్) భయపడుతున్నారు. భాజపా ఎప్పుడూ మీ ప్రభుత్వాన్ని కూల్చదు. మా పార్టీ నేరుగా ప్రజాభిప్రాయాన్నే కోరుతుంది. 2023లో వచ్చేది మేమే’’ అని అమిత్ షా అన్నారు. ‘గరీబీ హఠావో’ అని ఇందిరా గాంధీ నినాదమిచ్చారు గానీ, పేదరికం మాత్రం తొలగలేదని షా ఎద్దేవాచేశారు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే పేదరికం పారదోలడం సాధ్యమైందని అమిత్ షా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.