ఎన్నికల నిర్వహణకు తొందరెందుకు?: బొత్స

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఎన్నికలపై విముఖత చూపిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉంటుందని..

Published : 11 Jan 2021 01:21 IST

విశాఖ: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఎన్నికలపై విముఖత చూపిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉంటుందని.. అలాంటి ఆయన ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం విజయావకాశాలు వైకాపాకే ఉన్నాయని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై కోర్టులు సైతం ఆలోచించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు. రేపు ‘అమ్మ ఒడి’ ఉందని.. ఈలోగానే ఎన్నికల ప్రకటన ఎవరి లబ్ధి కోసం ప్రకటించారని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల సమస్య ఇప్పుడు లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు నెలరోజులు ఆలస్యమైతే వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈనెల 20 వరకు పొడిగించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ

మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని