ఎన్నికల నిర్వహణకు తొందరెందుకు?: బొత్స
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఎన్నికలపై విముఖత చూపిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉంటుందని..
విశాఖ: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఎన్నికలపై విముఖత చూపిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉంటుందని.. అలాంటి ఆయన ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం విజయావకాశాలు వైకాపాకే ఉన్నాయని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై కోర్టులు సైతం ఆలోచించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు. రేపు ‘అమ్మ ఒడి’ ఉందని.. ఈలోగానే ఎన్నికల ప్రకటన ఎవరి లబ్ధి కోసం ప్రకటించారని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల సమస్య ఇప్పుడు లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు నెలరోజులు ఆలస్యమైతే వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈనెల 20 వరకు పొడిగించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్