BRS: ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా సంక్షేమం?: కడియం శ్రీహరి
ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్పార్టీ గెలిచిందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో భారాస పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రజలు భావించారు. కానీ, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తోంది.
భారాస తెచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్లు అనుమతి పత్రాలు కూడా ఇచ్చారు. ‘దళితబంధు’కు నిధులు కేటాయించలేదని తెలిసింది. రైతుబంధు ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయంపై అవగాహన లేక అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. డిసెంబరు 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేస్తాం, దానిపైనే తొలి సంతకం అని గొప్పగా చెప్పారు. కానీ, ఈరోజు వరకు అతీగతీ లేదు. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు’’ అని కడియం శ్రీహరి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం