KCR: కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్
భారాస తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ‘కరీంనగర్ కదన భేరి’ సభతో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.
కరీనంగర్: భారాస తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ‘కరీంనగర్ కదన భేరి’ సభతో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ‘‘రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయరావట్లేదు. మూడు నెలల్లో పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారు. కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీకి తాకట్టు పెడుతున్నారు.
తెలంగాణలో మొన్న నేను గెలిచి ఉంటే.. దేశాన్ని చైతన్యం చేసేవాణ్ణి. కేసీఆర్ దిగిపోగానే కరెంట్, రైతు బంధు కట్ అయ్యాయి. ఈ ప్రభుత్వం కరెంటు, రైతు బంధు ఇవ్వలేకపోతోంది. పోలీసులకు రాజకీయాలు ఎందుకు? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు. మేం అలా చేస్తే కాంగ్రెసోళ్లు మిగిలేవారా? ఒక పన్ను వదులైతే మొత్తం రాలగొట్టుకుంటామా? కాళేశ్వరంలో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోందని రచ్చ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలో వస్తా.. కాళేశ్వరంపై వివరిస్తా. ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు అడిగితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతా అంటున్నారు. ఉద్యమ సమయంలో నేనూ పరుషంగా మాట్లాడా.. కానీ, సీఎం అయిన తర్వాత అలా మాట్లాడలేదు. తమాషాకు ఓటేయొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కరీంనగర్లో వినోద్ను గెలిపించాలి’’ అని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ