Kamal Haasan : కులం నా ‘ప్రధాన రాజకీయ ప్రత్యర్థి’ : కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రత్యర్థి గురించి సరికొత్తగా వ్యాఖ్యానించారు.
చెన్నై : కులం తనకు ‘ప్రధాన రాజకీయ ప్రత్యర్థి’ అని ప్రముఖ నటుడు(Actor), మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Haasan) వ్యాఖ్యానించారు. దర్శకుడు పా రంజిత్ నెలకొల్పిన ‘నీలం బుక్స్’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ‘నాకు అతి పెద్ద ప్రత్యర్థి, నా రాజకీయ ప్రత్యర్థి కులం. 21 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పటి నుంచి నేను ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా. ఈ విషయంలో నా అభిప్రాయం ఎప్పటికీ మారదు’ అంటూ కమల్ పేర్కొన్నారు.
అంతే కాకుండా ఆయన దేవుడి(God) గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘చక్రం కనిపెట్టిన తరువాత మానవుడు చేసిన గొప్ప సృష్టి దేవుడు. అలాంటి దైవం పేరుతో కొందరు మనపై దాడి చేస్తుంటే దాన్ని ఎంత మాత్రం అంగీకరించకూడదని’ తెలిపారు. అనంతరం దర్శకుడు పా రంజిత్(Pa.Ranjith) మాట్లాడుతూ కమల్హాసన్ కళాత్మక చిత్రాలను రూపొందించే ఫార్ములాను తయారు చేశారని ప్రశంసించారు. దాంతో ఇప్పటికీ అలాంటి చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ‘నీలం బుక్స్’ను ఒక వేదికగా ఎంచుకున్నానని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్