నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు.. సీఎంతో భేటీ అనంతరం కాకాణి
నెల్లూరు ‘వైకాపా’ పంచాయితీ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి చేరింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్లను జగన్ పిలిపించారు.
అమరావతి: నెల్లూరు ‘వైకాపా’ పంచాయితీ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి చేరింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్లను జగన్ పిలిపించారు. దీంతో వాళ్లిద్దరూ అక్కడికి చేరుకున్నారు.
నేతలిద్దరితో జగన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత అనిల్ యాదవ్ సీఎంతో సమావేశమయ్యారు. ఇటీవల నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల చించివేత, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో విభేదాలు, ఆయనపై చేసిన విమర్శలు తదితర అంశాలపై జగన్కు అనిల్ వివరించినట్లు సమాచారం. భేటీ అనంతరం అనిల్ మాట్లాడుతూ.. ‘‘కాకాణికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సాయం చేసిన వారికి మరింత ఎక్కువ సాయం చేస్తాను. నెల్లూరులో ఫ్లెక్సీల వివాదం ఏమీ లేదు. నెల్లూరు అభివృద్ధిపై ఆనం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే విదిలేస్తున్నాను. కొందరు నేతలు రకరకాల సందర్భాల్లో మాట్లాడతారు. పార్టీ బలోపేతం తప్ప మేం మరేదీ ఆలోచించం’’ అని పేర్కొన్నారు.
అనిల్తో భేటీ అనంతరం మంత్రి కాకాణి సీఎం జగన్ను కలిశారు. భేటీ అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అనిల్కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పోటాపోటీ సభలు అనేది అవాస్తవం. నెల్లూరు అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు. పార్టీ అభివృద్ధి గురించి మాత్రమే సీఎంతో మాట్లాడాం. జిల్లా అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలని.. ఇద్దరూ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు’’ అని కాకాణి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
Haryana Crisis: హరియాణాలో రాజకీయ సంక్షోభం వేళ జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌతాలాకు షాక్ తగిలింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో సైనీ ప్రభుత్వం మెజార్టీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?