ఆ ఎంపీ చనిపోలేదు: ఆస్పత్రి వర్గాలు
కర్ణాటక భాజపా ఎంపీ అశోక్ గస్తీ (55) ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 15 రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారంటూ............
అశోక్ గస్తీకి చికిత్స కొనసాగుతోందన్న వైద్యులు
బెంగళూరు: కర్ణాటక భాజపా ఎంపీ అశోక్ గస్తీ (55) ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 15 రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున వచ్చిన వార్తలపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్య చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశాయి. భాజపా నేతగా ఉన్న అశోక్ గస్తీ ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. అయితే, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అనేకమంది రాజకీయ ప్రముఖులు ట్విటర్లో సంతాపాలు కూడా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతున్న మణిపాల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుదర్శన్ బల్లాల్ స్పందించారు. గస్తీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనీ.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో లైఫ్ సపోర్టుపై వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్టు స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?