Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం

వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిలను ఆ పార్టీ నియమించింది.

Updated : 18 Dec 2023 17:46 IST

హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ఆ పార్టీ నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇన్‌ఛార్జిలుగా నియమితులైన వారిలో ముఖ్యమంత్రితోపాటు దాదాపు అందరూ మంత్రులే ఉన్నారు. 

  • చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ - రేవంత్ రెడ్డి
  • సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - భట్టి విక్రమార్క
  • నాగర్‌కర్నూల్‌ - జూపల్లి కృష్ణారావు
  • నల్గొండ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  • భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • వరంగల్‌ - కొండా సురేఖ
  • మహబూబాబాద్‌, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
  • ఆదిలాబాద్‌ - సీతక్క
  • పెద్దపల్లి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  • కరీంనగర్‌ - పొన్నం ప్రభాకర్‌ 
  • నిజామాబాద్‌ - జీవన్‌ రెడ్డి
  • జహీరాబాద్‌ - పి.సుదర్శన్‌రెడ్డి 
  • మెదక్‌ - దామోదర రాజనర్సింహ
  • మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని