Electoral bonds: బండారం బయటపడకూడదనే గడువు నాటకం: కాంగ్రెస్
ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడికి మరింత గడువు కావాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును కోరడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఎస్బీఐని ప్రభుత్వం రక్షణ కవచంగా వినియోగించుకుంటోందని ఆరోపించింది.
దిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు (Electoral bonds) సంబంధించి ఎస్బీఐకి (SBI) సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా వివరాలు వెల్లడించకపోవడంపై కాంగ్రెస్ స్పందించింది. వివరాల వెల్లడికి మరింత గడువు కావాలని ఎస్బీఐ కోరడాన్ని తప్పుబట్టింది. ఎస్బీఐని ప్రభుత్వం రక్షణ కవచంగా వినియోగించుకుంటోందని ఆరోపించింది. పార్టీకి నిధులు సమకూర్చిన కార్పొరేట్ మిత్రుల వివరాలు ప్రజలకు ఎక్కడ తెలిసిపోతాయోనని ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శించింది.
ఎన్నికల బాండ్ల స్కీమ్ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మార్చి 6లోగా ఈసీకి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడానికి ఎస్బీఐని ఆదేశించింది. అయితే, బాండ్లు కొనుగోలు చేసినవారు, ఆ బాండ్లను రిడీమ్ చేసుకున్నవారి వివరాలు సరిపోల్చడానికి జూన్ 30 వరకు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కారు దోబూచులాట ఆడుతోందని దుయ్యబట్టారు.
ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి ముగిసిన గడువు.. ఎస్బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్
వివరాలు బయటపెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉంటే.. మోదీ ప్రభుత్వం దాక్కుంటోందని ఎద్దేవా చేశారు. అందుకు ఎస్బీఐ వంత పాడుతోందని దుయ్యబట్టారు. ఎస్బీఐకి మూడు వారాల పాటు సుప్రీంకోర్టు గడువు ఇస్తే.. సరిగ్గా లోక్సభ ఎన్నికలు ముగిసేవరకు గడువు కోరడం ఏంటని ప్రశ్నించారు. ‘‘వాస్తవానికి ఎలక్టోరల్ బాండ్లను రెండు కండీషన్లతో విక్రయిస్తారు. 1. బాండ్లను కొనుగోలు చేసినప్పుడే ఆయా శాఖలు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరిస్తాయి. 2.బాండ్లపై కనిపించని సీరియల్ నంబర్ ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ వద్ద విరాళాలు ఇచ్చినవారు, అందుకున్న రాజకీయ పార్టీల వివరాలు కచ్చితంగా ఉంటాయి’’ అని రమేశ్ అన్నారు.
‘‘ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు బ్యాంకు వద్ద ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని 2017లో ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కోరినప్పుడు ఆ సమాచారం దొరుకుతుందని తెలిపింది. 2018లో ఓ రాజకీయ పార్టీ ఎలక్టోరల్ బాండ్లను ఎన్క్యాష్ చేసుకోవడంలో ఇబ్బందిపడినప్పుడు ఇదే ఎస్బీఐ ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకుని ఎన్క్యాష్మెంట్కు అవకాశం ఇచ్చింది’’ అని జైరాం రమేశ్ గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఎస్బీఐ వివరాల వెల్లడికి వెనకడుగు వేస్తోందని జైరాం రమేశ్ దుయ్యబట్టారు. ఒకప్పుడు ‘నేను తినను.. ఇంకొకరని తిననివ్వను’ అన్న మనిషి.. ఇప్పుడు ‘నేను చెప్పను.. చూపించను’ అంటున్నారని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
-
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!
-
నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్
-
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్