Mamata Banerjee: దేశంలో ప్రజాపాలన నెలకొల్పేందుకు శ్రమించాలి: మమత
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో శాంతిభద్రతలు మెరుగ్గానే ఉన్నాయని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో భాజపా పాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు శ్రమించాలన్నారు.
కోల్కతా: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నిక(lok sabha elections)ల్లో భాజపా(BJP) సర్కార్ను ఓడించి, అరాచక పాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు దేశమంతా శ్రమించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata banerjee) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఇటీవల బెంగాల్లో అవినీతి, హింస పెరిగిపోయాయంటూ చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్డారు. తమ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా మెరుగ్గానే ఉందని చెప్పారు. బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లోని గ్రామాల్లో నివసిస్తున్న అమాయకులను బలితీసుకుంటున్నా.. కేంద్రం మౌనం వహిస్తోందన్నారు. ఈ అంశంపై పట్టనట్టు వ్యవహరిస్తూ.. నిజనిర్ధారణ బృందాలను సైతం పంపించడంలేదని దీదీ విమర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమ ప్రభుత్వం అవినీతియమంటూ విద్వేషపూరిత ప్రచారం చేస్తోన్న భాజపాకు ప్రజలే గుణపాఠం నేర్పుతారని దీదీ అన్నారు. కేవలం భాజపాలోనే నిజాయతీపరులు ఉన్నట్టు.. ఇతర పార్టీల్లో మాత్రం దొంగలు ఉన్నట్టుగా భాజపా ప్రవర్తన ఉందని మండిపడ్డారు. భాజపా వాషింగ్మిషన్ లాంటిదని.. కళంకిత నేతలు ఆ పార్టీలో చేరగానే సాధువుల్లా మారిపోతారంటూ ఎద్దేవా చేశారు. బొగ్గు కుంభకోణంలో తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారు గానీ.. సంబంధిత అధికారులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం రోజున ఆవులను కౌగిలించుకోవాలని పిలుపునిచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకోవడంపైనా దీదీ తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ హగ్ చేసుకొనేటప్పుడు ఆవులు మనల్ని గాయపరిస్తే భాజపా పరిహారం చెల్లిస్తుందా? వాటి దాడిలో గాయపడిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ముందు ఆమోదం తెలపండి అని మమత కేంద్రానికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్