Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
సీఎం జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తే ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళ్తాడని వ్యాఖ్యానించారు.
విశాఖ: సీఎం జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తే ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళ్తాడని వ్యాఖ్యానించారు. జూన్ 7న జగన్ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ అంటున్నారని.. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామన్నారు. ఈ మేరకు విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
‘‘ఐటీ రంగం కోసం మాట్లాడితే.. జగన్ ప్రభుత్వం ఉరేసుకోవాలి. ఏపీ 0.14 శాతమే ఐటీ ఎగుమతులు చేసింది. తెలంగాణ కంటే ఏపీ ఐటీ ఎగుమతులు చాలా చాలా తక్కువ. దీనికి జగన్.. తల ఎక్కడ పెట్టుకుంటారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా బూటకం.. జగన్ మాటలన్నీ అవాస్తవాలే. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి జరగలేదు. కానీ, సొంత మీడియాలో మాత్రం తెగ ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాలు, కేసుల విషయంపైనే జగన్ దిల్లీ వెళుతున్నారు. అమరావతిని కిల్ చేశారు.. అమర్ రాజా కంపెనీని వేధించి రాష్ట్రం నుంచి పంపించేశారు. కియా, జాకీ పరిశ్రమలది అదే దుస్థితి. దమ్ముంటే.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై వైకాపా నేతలు చర్చకు రావాలి’’ అని రామకృష్ణ సవాల్ విసిరారు.
వివేకా హత్య కేసు విషయంలోనూ రామకృష్ణ స్పందించారు. మూడేళ్ల నుంచి ఈ హత్య కేసు దర్యాప్తు చేయడానికి సీబీఐకి సిగ్గు ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని ఆరోపించారు. సీబీఐకి విలువ లేకుండా వైఎస్ అవినాష్ రెడ్డి చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.