TS Elections: పొత్తుల్లేవ్.. ఒంటరిగానే బరిలోకి: సీపీఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులేకుండానే బరిలోకి దిగుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా సీపీఎం పోటీచేయనున్న 17 నియోజకవర్గాలను ఆయన ప్రకటించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా స్థానాలు, అభ్యర్థుల పేర్లను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. భద్రాచలం, అశ్వారావు పేటతోపాటు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ వైఖరిపై వీరభద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ వైరా స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ను కోరాము. భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట్లో అడిగాం. అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారు. చర్చల్లో భాగంగా మేం ఎన్నోమెట్లు దిగి వచ్చాం. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెబుతోంది. మాతో పొత్తు వద్దని కాంగ్రెస్ భావిస్తున్నట్లుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. కాంగ్రెస్ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించింది. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్తో సీపీఎం పొత్తు ఉండదు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది’’ అని తమ్మినేని వీరభద్రం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్