Politics: అనర్హత వేటు పడినా.. శిందేనే ముఖ్యమంత్రి: ఫడణవీస్
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందేపై అనర్హత వేటు పడదని, ఒకవేళ పడినా.. ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు.
ముంబయి: శివసేనలోని రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్కు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తుది అవకాశం ఇచ్చింది. ఈ పరిణామాల నడుమ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే (Eknath Shinde)పై అనర్హత వేటు పడదని, ఒకవేళ పడినా.. ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని తెలిపారు.
ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో ఫడణవీస్ మాట్లాడుతూ.. ‘మొదటి విషయం ఏంటంటే.. సీఎం శిందే అనర్హతకు గురికారు. ఒకవేళ అనర్హత వేటు పడినప్పటికీ.. ఆయన్ను శాసనమండలికి ఎంపిక చేసి, తిరిగి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఏక్నాథ్ శిందే నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం’ అని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం అక్టోబరు 30న తిరిగి విచారణను ప్రారంభించనున్న తరుణంలో.. ఫడణవీస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?
సీఎం శిందే సహా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్ రాహుల్ నార్వేకర్పై సుప్రీం కోర్టు గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ నెల 17న మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను స్పీకర్ ధిక్కరించలేరని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లను ఎప్పటికల్లా పరిష్కరిస్తారో తెలిపేందుకు స్పీకర్కు తుది అవకాశమిస్తూ.. విచారణను అక్టోబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్