AP Politics: కైకలూరులో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం.. జాతీయ రహదారిపై భైఠాయించిన జనసేన కార్యకర్తలు

ఏలూరు జిల్లా కైకలూరులో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ప్రతిగా జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించారు. 

Published : 01 Jun 2023 23:37 IST

ఏలూరు: కైకలూరులో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ప్రతిగా జనసేన నాయకుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు పల్లకిని పవన్‌ మోస్తున్నట్లు కైకలూరులో వైకాపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వైకాపా ఫ్లెక్సీలకు పోటీగా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటుకు నిర్ణయించింది. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం పేరుతో జనసేన నాయకుడు బీబీ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా ఫ్లెక్సీ తొలగించకుండా జనసేన ఫ్లెక్సీ తీయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, బీవీ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో జనసేన నాయకులు జాతీయ రహదారిపై భైఠాయించారు. ఈ చర్యతో బీవీ రావుతో పాటు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని