AP Politics: కైకలూరులో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం.. జాతీయ రహదారిపై భైఠాయించిన జనసేన కార్యకర్తలు
ఏలూరు జిల్లా కైకలూరులో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ప్రతిగా జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఏలూరు: కైకలూరులో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ప్రతిగా జనసేన నాయకుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తున్నట్లు కైకలూరులో వైకాపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వైకాపా ఫ్లెక్సీలకు పోటీగా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటుకు నిర్ణయించింది. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం పేరుతో జనసేన నాయకుడు బీబీ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా ఫ్లెక్సీ తొలగించకుండా జనసేన ఫ్లెక్సీ తీయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, బీవీ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో జనసేన నాయకులు జాతీయ రహదారిపై భైఠాయించారు. ఈ చర్యతో బీవీ రావుతో పాటు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?