BJP: భాజపాలోకి కాంగ్రెస్ నేత.. చేరిన రోజే జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు
కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.. భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు కూడా కాషాయ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.
దిల్లీ: కాంగ్రెస్ నుంచి ఈ ఏడాది భాజపాలో చేరిన సీనియర్ నేతలకు కాషాయ పార్టీలో కీలక పదవులు దక్కాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత సునీల్ జాఖఢ్ను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకోగా.. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. కాగా.. భాజపాలో చేరిన రోజే.. జైవీర్కు జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు దక్కడం గమనార్హం.
మూడు నెలల కిందటే కాంగ్రెస్కు రాజీనామా..
సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న 39 ఏళ్ల జైవీర్ షెర్గిల్.. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ నేషనల్ మీడియా ప్యానెలిస్ట్లో అత్యంత పిన్క వయస్కుడు ఈయనే. పంజాజ్ కాంగ్రెస్లో కీలక నేతల్లో ఒకరైన జైవీర్.. ఈ ఏడాది ఆగస్టులో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన వార్తల్లోకెక్కారు. హస్తం పార్టీ కొందరి కోసం మాత్రమే పనిచేస్తోందని గాంధీ కుటుంబంపై బహిరంగ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అన్నట్లుగానే శుక్రవారం (డిసెంబరు 2)న ఆయన భాజపాలో చేరడమే గాక.. తొలి రోజే జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు అందుకున్నారు.
కీలక కమిటీలో కెప్టెన్కు చోటు..
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖఢ్ను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ భాజపా నేడు ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుతో తలెత్తిన విభేదాల కారణంగా కెప్టెన్ అమరీందర్ సింగ్.. గతేడాది హస్తం పార్టీతో దశాబ్దాల పాటు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి.. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కెప్టెన్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో భాజపాలో చేరిన అమరీందర్ సింగ్.. తన పీఎల్సీ పార్టీని కూడా కాషాయ పార్టీలో విలీనం చేశారు. సునీల్ జాఖఢ్ కూడా ఈ ఏడాది మే నెలలో హస్తం పార్టీకి గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్