బిహార్లో ఎన్ఆర్సీ అమలు చెయ్యం: నితీశ్
పట్నా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ని ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. బిహార్లో ఎన్ఆర్సీని ఎట్టిపరిస్థితుల్లోను అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంటులో ప్రశ్నించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం బిహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఎవరూ సమర్థించడం లేదు. ఎన్ఆర్సీపై జరుగుతున్న వివాదం గురించి ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’ అని సీఎం నితీశ్కుమార్ అన్నారు. బిహార్లో సీఏఏను అమలు చేసే అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. భాజపాయేతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు సీఏఏను అమలు చెయ్యమని ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎన్డీయే మిత్రపక్షమైన బిహార్ కూడా చేరింది.
మే 15 నుంచి మే 28 వరకు ఎన్ఆర్సీని చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత సీఎం నితీశ్కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు నితీశ్ జేడీయూ పార్టీ మద్దతుగా ఓటేసింది. ఆ సమయంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఏఏకి మద్దతుగా ఓటేయడాన్ని ఆయన విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
- Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్ అతడే.. ‘తమిళ్ రాకర్స్’ ట్రైలర్ చూశారా!