బిహార్లో ఎన్ఆర్సీ అమలు చెయ్యం: నితీశ్
పట్నా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ని ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.
పట్నా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ని ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. బిహార్లో ఎన్ఆర్సీని ఎట్టిపరిస్థితుల్లోను అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంటులో ప్రశ్నించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం బిహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఎవరూ సమర్థించడం లేదు. ఎన్ఆర్సీపై జరుగుతున్న వివాదం గురించి ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’ అని సీఎం నితీశ్కుమార్ అన్నారు. బిహార్లో సీఏఏను అమలు చేసే అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. భాజపాయేతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు సీఏఏను అమలు చెయ్యమని ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎన్డీయే మిత్రపక్షమైన బిహార్ కూడా చేరింది.
మే 15 నుంచి మే 28 వరకు ఎన్ఆర్సీని చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత సీఎం నితీశ్కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు నితీశ్ జేడీయూ పార్టీ మద్దతుగా ఓటేసింది. ఆ సమయంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఏఏకి మద్దతుగా ఓటేయడాన్ని ఆయన విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..