పీకేతో కేజ్రీ సంబరాలు

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.

Published : 11 Feb 2020 14:27 IST

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. ఆప్‌ కార్యాలయంలో పీకేను ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందించుకున్నారు. 

అటు ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆప్‌ విజయంపై ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘భారత ఆత్మను రక్షించేందుకు వెన్నంటి నిలిచిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’ అని పీకే ట్వీట్ చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌ దిల్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున పనిచేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని