సచిన్ పైలట్ తొలగింపునకు గవర్నర్ ఆమోదం!
రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రతిపాదనకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేశ్ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు........
జైపుర్: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రతిపాదనకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేశ్ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు.
సీఎల్పీ సమావేశంలో సచిన్కు ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేసిన తర్వాత గహ్లోత్ నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సచిన్, మంత్రులను తొలగించాలనుకుంటున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన గహ్లోత్.. ‘‘చివరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ కుట్ర ఆరు నెలలుగా జరుగుతోంది. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు భాజపా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా భాజపా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదు. 30 మంది ఎమ్మెల్యేలు కలిసి పార్టీని ఏర్పాటు చేయలేరు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ పరోక్షంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించే ప్రయత్నం చేశారు.
మరోవైపు సచిన్ వర్గంలోని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముకేశ్ భాకర్ను కూడా పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన గహ్లోత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో గెలిచి పదవిలోకి వచ్చిన తనను గహ్లోత్ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
మరోవైపు రాజస్థాన్లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణస్వీకారానికి తేదీని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. జులై 16 సాయంత్రం 4:30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..