ప్రశ్నిస్తే పీడీ కేసులు.. నిలదీస్తే ఐటీ దాడులు
ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ.. దాడులు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నాయకుడు,
‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో భట్టి విక్రమార్క
చిలుకూరులో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క
మధిర గ్రామీణం, న్యూస్టుడే: ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ.. దాడులు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మధిర మండలం చిలుకూరులో గురువారం ‘పీపుల్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభమై ఆంధ్రా ప్రాంతం దొడ్డదేవరపాడు, వెల్లంకి సర్కిల్ మీదుగా తొర్లపాడు, సాయిపురం, తొండలగోపవరం చేరింది. అక్కడి నుంచి ఎర్రుపాలెం మండలం మీనవోలు చేరుకుంది. వివిధ గ్రామాల్లో భట్టి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య, రామాయంపేటలో సంతోష్, అతని తల్లి సజీవ దహనం ఘటనలు ఇందుకు నిదర్శమన్నారు. మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హన్మంతరావు పాదయాత్రలో పాల్గొన్నారు. తొండలగోపవరం వద్ద పాదయాత్రలో భట్టి విక్రమార్క వెంట నడిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
Haryana Crisis: హరియాణాలో రాజకీయ సంక్షోభం వేళ జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌతాలాకు షాక్ తగిలింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో సైనీ ప్రభుత్వం మెజార్టీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM