CM KCR: అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఎస్పీ

Published : 21 May 2022 12:35 IST

దిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో ఆయన భేటీ కానున్నారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరగనుంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈ నెల  22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి కేసీఆర్‌ చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు కేసీఆర్‌ పంజాబ్‌లోనే ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని