నిధులు మళ్లించి... తొలి స్థానంలో ఉన్నామని దుష్ప్రచారమా?
ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారం దక్కించుకున్న జగన్రెడ్డి వారికి అమలుచేయాల్సిన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించింది కాక... ఉప ప్రణాళిక అమలులో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ఆగ్రహం
ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారం దక్కించుకున్న జగన్రెడ్డి వారికి అమలుచేయాల్సిన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించింది కాక... ఉప ప్రణాళిక అమలులో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీల్లో సాధికారత తీసుకొచ్చేలా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు అమలుచేశారు. జగన్ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు ఏం చేసిందో చెప్పగలరా? నవరత్నాల్లో పెట్టే ఖర్చును దళిత, గిరిజనుల లెక్కల్లో చూపడం వంచించడమే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొత్తం బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.52,462 కోట్లు వెచ్చించారు. జగన్రెడ్డి గత నాలుగేళ్లలో రూ.48వేల కోట్లు ఖర్చుచేశారు. ఇదీ నవరత్నాల్లో పెట్టినదే. విదేశీవిద్య కింద తెదేపా ప్రభుత్వం 1,200 మంది దళిత, గిరిజనులను విదేశాలకు పంపింది. జగన్ ఒక్క దళితుడ్నయినా విదేశాలకు పంపారా?’ అని నక్కా ఆనంద్బాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?