ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమావేశం
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.
గాంధీభవన్, న్యూస్టుడే: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్లిన నాయకులు మంగళవారం ఉదయం శ్రీనగర్లో ఖర్గేను కలిశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్బాబు, సంపత్కుమార్ తదితరులు ఆయనను కలిసి రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. భారత్ జోడో యాత్ర మాదిరిగానే ‘హాథ్సే హాథ్ జోడో అభియాన్’ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారికి ఖర్గే సూచించారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఈ రెండు నెలల పాటు ప్రజల ముందుండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రూపొందించిన ఛార్జిషీట్లను ప్రతి ఇంటికి చేరేలా చొరవ తీసుకోవాలని ఖర్గే సూచించినట్లు ముఖ్య నాయకుడొకరు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నంపై ఏం చెబుతారు?: రేవంత్రెడ్డి
గాంధీభవన్, న్యూస్టుడే: సర్పంచులకు ఒక్క రూపాయీ బాకీ లేమని చెప్పే మంత్రులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సర్పంచి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సంబంధించి ఏం సమాధానం చెబుతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయన మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పు చేసిన పాపానికి నందిపేట సర్పంచి దంపతులు వాణి, తిరుపతిలు కలెక్టరేట్లోనే ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్లో ఏసీ గదుల్లో కూర్చుని సర్పంచులకు ఒక్క రూపాయీ బాకీలేమని ప్రకటించే మంత్రులు దీనికి ఏం జవాబు చెబుతారు?’ అని రేవంత్ నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..