Vijayasai Reddy: విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరుల సస్పెన్షన్
విశాఖలో అధికార వైకాపా ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు రగులుతోంది. పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్ఛార్జుల వ్యవహారంతో రాజుకున్న వేడి పెరుగుతోంది.
చక్రం తిప్పిన వైవీ సుబ్బారెడ్డి
విశాఖ వైకాపాలో ఆధిపత్యపోరు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో అధికార వైకాపా ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు రగులుతోంది. పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్ఛార్జుల వ్యవహారంతో రాజుకున్న వేడి పెరుగుతోంది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించిన వారితో నియామక ప్రకటన విడుదలైన ఒక్క రోజులోనే పేర్లు మార్చేలా మాజీ ఇన్ఛార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం జరిగిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులైన వైకాపా నగర 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్, 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్పై సస్పెన్షన్ వేటు వేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్కుమార్కు సహకరించకపోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనికి వెనుక వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేయర్, ఫ్లోర్లీడర్ ఎవరికీ తెలియకుండానే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారనే అంశం పార్టీలో చర్చకు దారి తీసింది. పీవీ సురేష్, దొడ్డి కిరణ్లు విజయసాయిరెడ్డికి కొన్నేళ్లుగా ప్రధాన అనుచరులుగా ఉన్నారు. విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పీవీ సురేష్కు ట్రేడ్ యూనియన్లో ఓ డైరెక్టరు పోస్టు ఇచ్చారు. భూకబ్జాల వివాదాల్లో ఉన్న దొడ్డి కిరణ్ ఏకంగా విజయసాయిరెడ్డికి శిలా విగ్రహం నిర్మించి అప్పట్లో స్వామిభక్తి ప్రదర్శించారు. వీరిద్దరిపై ఆది నుంచి ఆరోపణలున్నాయి. విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులు కావడంతో వీరి హవా సాగినట్లు పలువురు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్