Gali Janardhana Reddy: ‘గాలి’ కుటుంబానికి ఎదురుదెబ్బ
వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
ఒక్క జనార్దనరెడ్డికే విజయం
హొసపేటె, న్యూస్టుడే: వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. జనార్దనరెడ్డి మినహా పోటీలో నిలిచిన ఆయన కుటుంబసభ్యులంతా పరాజయం పాలయ్యారు. సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకరరెడ్డి భాజపా తరఫున బరిలోకి దిగగా, జనార్దనరెడ్డి, ఆయన భార్య లక్ష్మీ అరుణ తమ సొంత పార్టీ కల్యాణ రాజ్యప్రగతి పక్ష(కేఆర్పీపీ) అభ్యర్థులుగా పోటీ పడ్డారు. గంగావతి స్థానం నుంచి జనార్దనరెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఇక్బాల్ అన్సారీ(కాంగ్రెస్)పై 8,366 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ కేఆర్పీపీ తరఫున నిలిచిన 46 మంది అభ్యర్థులూ ఓటమి పాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా భావించే బళ్లారి నగర నియోజకవర్గంలోనూ జనార్దనరెడ్డి తన భార్యను గెలిపించలేకపోయారు. ఇక్కడ భాజపా తరఫున పోటీ చేసిన సోదరుడు సోమశేఖరరెడ్డికీ విజయం దక్కలేదు. ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్రెడ్డికి పట్టం కట్టారు. హరపనహళ్లి నుంచి భాజపా తరఫున పోటీ చేసిన జనార్దనరెడ్డి మరో సోదరుడు కరుణాకరరెడ్డి కూడా ప్రత్యర్థి లతా మల్లిఖార్జున్ చేతిలో ఓడారు. ఇక్కడ సోదరుడిని ఓడించడానికి గాలి జనార్దనరెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి మల్లిఖార్జున్కు మద్దతిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు భాజపా తరఫున బరిలో నిలిచిన గాలి సన్నిహితులు రవాణాశాఖమంత్రి బి.శ్రీరాములు (బళ్లారి రూరల్) టి.హెచ్.సురేశ్ బాబు (కంప్లి)లకు నిరాశే ఎదురైంది. వీరిద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం